కంటిరోగులను పరీక్షించేందుకు, వారి కంటిలోని భాగాలను ఫోటోలు తీసేందుకు ఐ ఫోన్ యాప్ను వినియోగించవచ్చునని పరిశోధకులు అంటున్నారు. వీటితోబాటు వీడియోలు కూడా తీయవచ్చునని యూఎస్లోని రాస్ ఐ ఇన్సిట్యూట్ డాక్టర్లు తెలిపారు. దీనివల్ల కంటి రుగ్మతలను త్వరగా గుర్తించి చికిత్స చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
28 మంది రోగులను పరీక్షించేందుకు తమ బృందం ఐ ఎగ్జామినర్ స్మార్ట్ ఫోన్ సిస్టమ్ని, ఐ ఫోన్ని వినియోగించినట్టు వారు చెప్పారు. ఈ కొత్త విధానం కంటి డాక్టర్లకే కాక ఆస్పత్రులకు, జనరల్ ప్రాక్టీష్నర్లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఈ బృందం తెలిపింది. ఈ చికిత్సా విధానంలో రోగులు ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉండదని వారు స్పష్టం చేశారు.
28 మంది రోగులను పరీక్షించేందుకు తమ బృందం ఐ ఎగ్జామినర్ స్మార్ట్ ఫోన్ సిస్టమ్ని, ఐ ఫోన్ని వినియోగించినట్టు వారు చెప్పారు. ఈ కొత్త విధానం కంటి డాక్టర్లకే కాక ఆస్పత్రులకు, జనరల్ ప్రాక్టీష్నర్లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఈ బృందం తెలిపింది. ఈ చికిత్సా విధానంలో రోగులు ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉండదని వారు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment